Wednesday, March 25, 2009

తెలుగు వారి uugadi

ఉగాది పచ్చడి !!!



!! కావాల్సినవి!!
తగినన్ని మామిడి ముక్కలు
వేప పువ్వు--2 టీ స్పూన్స్
కొత్త చింతపండు --100 గ్రాముల
బెల్లం--30 గ్రాముల
టీ స్పూను కారం
తగినంత ఉప్పు
2--అరటిపండు ముక్కలు


!! తయారు చేసే విధానం !!

ముందుగా కొత్త చింతపండుని ఓ గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి.
ఆ తర్వాత చింతపండు పులుసు పిండి ఓ గిన్నెలో వేయాలి.
ఈ పులుసులో సన్నగా తరిగిన మామిడి ముక్కలు,వేప పువ్వు,కారం,ఉప్పు కలపాలి.
ఆ తర్వాత దానికి బెల్లం,అరటి పండు ముక్కలు కలిపితే ఉగాది పచ్చడి రెడీ.
మరి మీరు ఉగాదికి సిద్ధం కాండి

వాల్ పేపర్స్


అందమయేన కార్టూన్లు :

డౌన్లోడ్ చేయండి:


Windows xp new wallpapers:


Part1:
Part2:
Part3:

Wednesday, March 11, 2009

కొత్త ఉద్యోగం

ప్రస్తుత కాలంలో ఉద్యోగాల తీరుతెన్నులు పూర్తిగా మారిపోతున్నాయి. కొన్నేళ్ల క్రితం దాదాపుగా ఒకే రాష్ర్టానికి చెందిన ఉద్యోగులు కలసి పనిచేసేవారు. కానీ ప్రస్తుతం సంస్థల్లో భిన్న సంస్కృతులు కనిపిస్తున్నాయి. భిన్నప్రాంతాలకు చెందిన వారు కలిసి ఒకేచోట పనిచేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో విదేశీయులతో కూడా పనిచేయాల్సి వస్తోంది. ఇవన్నీ ప్రపంచీకరణ తెస్తున్న మార్పులు. వచ్చిన వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సంస్థలు ప్రతిభావంతుకోసం జల్లెడపట్టక తప్పదు. ఇలాంటి వారు ఒకే ప్రాంతంలో ఉంటారన్న భరోసా ఏమీ లేదు. వారు ఏ ప్రాంతంలో ఉన్నా వారిని సంస్థలు ఆహ్వానిస్తున్నాయి. ఇది కంపెన్లీల్లో మిశ్రమసంస్కృతికి దారితీస్తోంది.

ఈ పరిస్థితుల్లో రాణించాలంటే కేవలం పనిలో సామర్ధ్యం చూపించిన మాత్రాన సరిపోదు. జట్టు సమతూకం సరిగ్గా ఉండేట్లు ప్రతి ఒక్కరూ తమవంతు కృషచేయాలి. లేదంటే జట్టు మొత్తానికి చెడ్డపేరు వస్తుంది. ఒక వ్యక్తి దృక్పథంపై అతను పెరిగిన సమాజం ప్రభావం చూపిస్తుంది. అతని ఆలోచన సరళి, ఆకళింపు చేసుకునే విధానం, సమస్యలను చేసే కోణం, పరిష్కరించే విధానం, తెలియచెప్పే పద్ధతి... ఇలా అన్నీ అతను పెరిగిన సమాజానికి అనుగుణంగానే ఉంటాయి. అవన్నీ మరో వ్యక్తి కోణంలో భిన్నంగా కనిపించవచ్చు. దీన్ని కూడా అధిగమించి వాస్తవ అంశాలను సరిగ్గా బేరీజు వేసుకున్నప్పుడే జట్టు సమతూకం దెబ్బతినకుండా ఉంటుంది.

  • సహోద్యోగుల సంస్కృతి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబర్చాలి.
  • వారి పండుగలు వగైరా వాటికి శుభాకాంక్షలు చెప్పాలి. వీలయితే వారితో కలిసి వేడుకలు జరుపుకోవాలి.
  • వారి భాష నేర్చుకోవడానికి ఆసక్తి కనబర్చాలి.
  • మీ సంస్కృతి సంప్రదాయాల గురించి వారికి తెలపండి. పండగల సమయాల్లో వారిని మీ ఇంటికి ఆహ్వానించండి.
  • వీలైనప్పుడు వారి వివాహవేడుకలకు హాజరవ్వండి. మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు వారిని ఆహ్వానించండి.
  • ఖాళీ సమయాలు, వారాంతపు సెలవుల్లో వారితో మిత్రులంతా కలసి దగ్గర్లోని చారిత్రక ప్రదేశానికో... దేవాలయానికో వెల్లేలా ప్రణాళిక వేసుకోండి.
వారితో ఏవైనా విబేదాలు వస్తే.. వాటిని సామనస్యంగా పరిష్కరించుకోండి. యాజమాన్యం వరకూ తీసుకెళ్లే అది మీకు, వారికి ఇద్దరికీ మంచిదికాదు.

Thursday, March 5, 2009

మన చరిత్ర

ఆ కోనేటిలో నీరు ఎర్రగా వుంటాయి - గండికోట

గండికోట - రెండు కొండలనూ వరుసుకుంటూ వెళ్తున్న పెన్నా నది ఇవతలి ఒడ్డుపైనుంచీ చూస్తే ఆవలి తీరం దగ్గరగా వున్నట్లే వుంటుంది గానీ ఎంత శక్తిమంతుడైనా ఆవలి ఒడ్డుకు రాయి విసరలేడని ప్రతీతి. కొండలో పెన్న చేసిన

ఆ గండి వల్లనే దానికి “గండి కోట” అని పేరొచ్చిందట,క్లుప్తంగా గండికోట గురించి ఇక విషయానికొస్తే ...

గండికోట మన రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం . ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణికి గండికోట కొండలని పేరు . ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు స్పష్టమవుతున్నది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవుదాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచమేర్పడింది.


తెలుగు వారి శౌర్య ప్రతాపాలకు, దేశాభిమానానికి, హిందూధర్మ సంరక్షణాతత్పరతకు ప్రతీక గండికోట. విజయనగర సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలచి, విజయనగర రాజులకు విశ్వాసపాత్రులై, పలు యుద్ధములలో తురుష్కులను ఓడించి, ప్రసిద్ధి గాంచిన పెమ్మసాని నాయకులకు నెలవు గండికోట.ఒకానొకప్పుడు దుర్భేధ్యమైన ఈ రేచర్ల నాయకుల కోట ఇప్పుడు శిధిలావస్థలో ఉన్నది. ఇది ఒక ముఖ్య చూడదగిన పురాతన ప్రదేశము.

వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకుతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపై ఇనుప సూది మేకులున్నాయి. కోట ప్రాకారం ఎర్రటి నున్నని శాణపు రాళ్ళతో నిర్మించారు. కొండ రాతి పై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతురస్రాకారంలోను, దీర్ఘ చతురస్రాకారంలోను 40 బురుజులున్నాయి. గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది.

కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అప్పటి శిధిల శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి.
జామా మసీదు

మీర్ జుమ్లా జామా మసీదును సుందరంగా నిర్మించాడు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు. ఇంతే గాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం ఇక్కడి ప్రత్యేకత.

ఇక్కడ ఉన్న ఓ కోనేటిలో నీరు ఎర్రగా వుంటాయి ఎందుకంటే ,పూర్వం యుద్ధం ముగిసిన తరువాత ఆ కత్తులన్ని ఇక్కడి కోనేతిలోనే కడిగే వారట ,అందుకే అందులో వున్న నీళ్ళకి ఆ ఎరుపురంగుంటుంది అని అంటారు ,గమ్మత్తైన విషయమేమిటంటే ఇప్పుడు రాజులు లేరు రాజ్యాలు లేవు కాని ఆ కోనేటి నీరు అలానే ఎర్రగానే వున్నాయి .
గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి.
చరిత్ర
గండికోట భారత దీపకల్పములోని ఒక ప్రముఖమైన గిరిదుర్గము, దీని చరిత్ర 13వ శతాబ్దము యొక్క రెండవ అర్థభాగములో మొదలవుతుంది. గండికోట కైఫియత్ లో పశ్చిమ కళ్యాణీ చాళుక్య రాజైన ఆహవమల్ల సోమేశ్వర I చే మలికినాడు సీమకు సంరక్షకునిగా నియమించబడిన కాకరాజు శా.1044 శుభకృతు నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి (1123 జనవరి 9) నాడు ఈ కోటను కట్టించెను అని పేర్కొనబడింది. ఐతే ఇదినిజమని నిర్ధారించడానికి మరే ఇతర చారిత్రక ఆధారాలూ లేవు. త్రిపురాంతకము వద్ద గల శా.1212 (1290) నాటి ఒక శాసనం ప్రకారం, అంబదేవ అనే ఒక కాయస్త నాయకుడు, తన రాజధానిని వల్లూరు నుంచి గండికోట కు మార్చాడని భావిస్తున్నారు. ఉప్పరపల్లె దగ్గర గల శా.1236కు చెందిన ఒక శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని సామంతుడు ఒకరు ఈ కోటను జయించాడని, ప్రతాపరుద్రుడు జుట్టయలెంక గొంక రెడ్డిని గండికోటని పాలించడానికి నియమించాడని తెలుస్తోంది.

గండికోట విజయనగర సామ్రాజ్య కాలములో ఉదయగిరి మండలము (ప్రాంతము)లోని ఒక సీమకు రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దపు రెండవ అర్ధభాగములో గండికోటను పెమ్మసాని నాయకులు తిమ్మానాయుడు, రామలింగనాయుడు విజయనగర రాజుల సామంతులుగా పాలించారు.[1] విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమైనపుడు, పదిహేడవ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా కుమార తిమ్మానాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగము చేయించి ఈ కోటను స్వాధీన పరచుకొన్నాడు.
మీర్ జుంలా గండికోటలోని మాధవస్వామి ఆలయము ధ్వంసం చేసి పెద్ద మసీదు నిర్మించాడు. దేవాలయానికి చెందిన వందలాది గోవులను చంపించాడు.కోటను ఫిరంగుల తయారీకి స్థావరము చేస్తాడు.గండికోటపై సాధించిన విజయముతో మీర్ జుంలా మచిలీపట్నం నుండి శాంథోం (చెన్నపట్టణము) వరకు అధికారి అయ్యాడు.ఈ సమయములోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాల వర్తకుడు టావర్నియెర్ గండికోట సందర్శించాడు.
ఎలా చేరుకోవాలంటే ...
గండికోట జమ్మలమడుగు నుంచి పడమరగా దాదాపు ఆరు మైళ్ళ దూరంలో ఒక పర్వత శ్రేణిపై ఉన్నది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి. జమ్మలమడుగు నుంచి బస్సు సౌకర్యం కలదు .
రంగనాథాలయం: ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన శా.1479 (క్రీ.శ.1577) నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోట లోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణం అని స్పష్టమౌతుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహైదవ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పవచ్చు.

మాధవరాయ ఆలయం ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్రీ.శ.పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్ప కళా లక్షణాలు, ఆలయనిర్మాణశైలిని బట్టి చూసినా ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్లు తోస్తుంది. ఆలయనిర్మాణాన్నీ, అందలి శిల్పకళారీతుల్నీ, వాటి లక్షణాలనూ విశదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో(దాదాపుగా 1501-1525 మధ్యకాలంలో) నిర్మించినట్లు చెప్పవచ్చు

మూడు శతాబ్దములు విజయనగర రాజులకు సామంతులుగా పలు యుద్ధములలో తురుష్కులపై విజయములు సాధించి, హిందూధర్మ రక్షణకు, దక్షిణభారత సంరక్షణకు అహర్నిశలు శ్రమించి, రాయలవారి ఆస్థానములో పలుప్రశంశలు పొంది, చరిత్ర పుటలలోనికెక్కిన యోధానుయోధులు గండికోట నాయకులు.
సిని ప్రస్థానంలో గండికోట
ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు, సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.హేతువాది అయిన గూడవల్లి రామబ్రహ్మం 1934 లో ఆంధ్ర నాటక పరిషత్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆయన కమ్మ కుల చరిత్ర అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకం వ్రాయడం కోసం కమ్మ కులం గురించి అవసరమైన సమాచారం సేకరించడానికి కడపకు వెళ్ళాడు. అక్కడ ఆయన గండికోట పట్ల ఆకర్షితుడై ఆ కోట గురించి పరిశోధన చేసి 'గండికోట పతనం' అనే నాటకం వ్రాశాడు. ఈ నాటకం అనేక నగరాల్లో ప్రదర్శించబడి మంచి ప్రజాదరణ పొందింది.

గండికోట గురించిన పూర్తి చరిత్రతో మరో టపా లో కలుసుకుందాం అంతవరకు సెలవు

మన హిందు మతం ఎంత గూప్పదో తెలుసుకోండి

కాషాయవస్త్ర ధారి గా సాయి బాబా


ఇక్కడ ఒక ప్రముఖులైన గురువులు, గుంటూరు వాస్తవ్యుల ఫొటో కూడా లభ్యమైంది. దత్తోపాసకులైన ఈ గురువులు ఒకసారి షిర్డి వెళ్ళినప్పుడు తీసిన ఫొటో గా చెప్పారు. ఇందులో చిత్రం ఏమిటంటే ఫొటో తీస్తున్నపుడు లేని ఒక కాషాయ వస్త్ర ధారి (సాయి బాబాలా వున్నారు) ఫొటోలో వచ్చారు, ఈ గురువుల వెనుక. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు సేకరించవలసి వుంది.

ఏది ఏమైనా సాధన వల్ల, మంత్రదేవతోపాసన వల్ల సిద్ధులు కలుగుతాయని, యోగసాధన వల్ల ఆరోగ్యం, శాంతి కలుగుతాయని చెపుతున్నారు. మనం తినే తిండి కంటే పీల్చే గాలి ముఖ్యమైనది. పరిశుభ్రమైన గాలి ఆరోగ్యానికి మంచిది. కాని అది ఈనాడు కరువైపోతున్నది. భోపాల్లో యూనియన్ కార్బైడ్ దుస్సంఘటన ప్రపంచం మర్చిపోలేనిది. విష వాయువుల వల్ల లక్షమందికి పైగా దెబ్బ తినడం జరిగింది, ఎంతోమంది మరణించారు కూడా. కాని అంత భయంకర మైన సంఘటన మధ్యలో ఒక కుటుంబం మాత్రం క్షేమంగా మామూలుగా వుంది, ఈ విషయం ఆనాటి హిందు పేపర్లోనూ వచ్చింది. మరి ఈ కుటుంబం ఆ విషవాయువుల బారినుండి ఎలా బయటపడింది? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు గాయత్రీ హోమం చేస్తున్నారుట!

మంత్ర మహిమ

చాలా ఏళ్ళ క్రితం కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర స్వామీజి అంధ్రదేశాన్ని పర్యటిస్తూ చందోలు గ్రామానికి వెళ్ళారుట. ఇక్కడ ఆపండి అంటూ అక్కడో చిన్న ఇంట్లోకి అనుకోకుండా వెళ్ళేసరికి అక్కడున్న భక్తులంతా ఆశ్చర్యపోయారు. 'అమ్మ చెప్పింది ' అంటూ ఆ ఇంట్లోకి వెళ్ళారు, అది సాహితీ ప్రపంచలో వారికి, ఆ ప్రాంతంలో వారికి పరిచితమైన నిరాడంబర సాధకులు, కవి కీ.శే. ఛందోలు శాస్త్రి గారి ఇల్లు. బహుశా అప్పటికీ ప్రపంచానికి ఆయన ఏమిటో పూర్తిగా అర్ధంకాలేదుట. ఏదో పంతులుగారు అనుకుంటారు కదా! కొన్నేళ్ళకి ప్రముఖ వార్తా పత్రిక మధ్య పేజీలో పెద్ద రెండుపేజీల ఫొటో ఇంకా సంచలన వార్త ప్రచురితమైంది. విదేశాలలో విన్నా, అలాంటి వార్త తెలుగుదేశంలో మొదటిదేమో! ఆ వార్త ప్రకారం, ఛందోలు శాస్త్రిగారు దివంగతులైనప్పుడు వారికి మిత్రులైన కొందరు సాహితీవేత్తలు, ఊరి వారు స్మశానానికి వెళ్ళారుట. అక్కడ దహన సంస్కారాలు జరుగుతుండగా ఒక తెల్లని స్త్రీ మూర్తి ఆయన తలవద్ద కొద్ది నిమిషాలు అందరికీ దర్శనమిచ్చి అదృశ్యమయ్యిందిట. అందరు ఆశ్చర్యపోయారు, అంతలో అక్కడే వున్న ఫొటోగ్రాఫర్ కూడా వెంటనే ఫొటో తీసాడు. ఈ ఫొటోలో ఎడమచేతి వైపు తెల్లని పారదర్శకమైన స్త్రీమూర్తిని చూడొచ్చు.

అయితే ఈమె ఎవరు? అన్న చర్చ ఆంధ్రమంత్ర రంగాలలో చర్చనీయాంశంగా ఉండి పోయింది. ఇన్నాళ్ళు ఆయన ఉపాసించిన దేవి ఆయనలోనే వుందని, ఆమె ఆయన మరణించాక బయటకు వచ్చిందని కొందరు, ఆ దేవతామూర్తి దేవతాలోకాలనుండి ఆయనను తీసుకెళ్ళడానికి వచ్చిందని కొందరు అన్నారు. మంచి విషయం ఏమిటంటే ఇది జరిగిన తర్వాత, ఇది మాగొప్పతనం అంటూ ఆయన వైపునించి ఎవరూముందుకు రాలేదు, ప్రచారాలూ చేసుకోలేదు. ఇప్పటికీ ఈ చిత్రం ఒక చిత్రం.

Wednesday, March 4, 2009

గాంధీ కి షరత్




కొంచం నవ్వండి

కోలీవుడ్ నటుడు సునీల్ భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ వేషం వేస్తే ఎలా ఉంటారన్న ఊహకు ప్రతిరూపమే ఈ చిత్రం. ఈ ఫోటో ఇంటర్నెట్ ప్రపంచంలో టాలీవుడ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటోంది.




































ముంబాయి జూ పార్క్ లోని కోతులన్నీ గుంపగా చేరి తమ నిరసన తెలుపుతున్నాయి. జూ అధికారి విషయం ఎమిటని విచారించగా "తమని ఎవరో Symond అన్నారని, అ మాట వెనక్కి తీసుకునేంత వరకు తమ నిరసన కొనసాగుతుందని " తేలిసింది



భరత మాత ముద్దు బిడ్డ

క్రూరమైన ఆంగ్ల గంతువులకు సింహసోప్నం మన భగత్ సింగ్ . అతను గురించి మనం తెలుసుకోవలిస్నా అవసరం ఎంతయీన ఉంది.

ఆస్కార్ విజేతల కు జైహూ