Thursday, August 27, 2009

పోఖ్రాన్- 2పై ప్రకటనలన్నీ బూటకమేనా?


దేశ అణు సామర్థ్యంపై అనుమానాలకు దారితీసే సంచలనాత్మక వివరాలను ఓ సీనియర్ డీఆర్‌డీఓ శాస్త్రవేత్త ఒకరు గురువారం వెల్లడించారు. పోఖ్రాన్- 2 అణు పరీక్షలతో సంబంధం ఉన్న డీఆర్‌డీఓ సీనియర్ శాస్త్రవేత్త సంతానం మాట్లాడుతూ.. ఈ అణు పరీక్ష పాక్షికంగానే విజయవంతమైందని తెలిపారు. పోఖ్రాన్- 2 అణు పరీక్ష ఫలితాలు అంచనాలను అందుకోలేదన్నారు.

పోఖ్రాన్ అణు పరీక్ష కోసం పనిచేసిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్తల్లో ఒకరైన కె.సంతానం వెల్లడించిన సంచలనాత్మక వివరాలను గురువారం ఓ ఇంగ్లీషు దినపత్రిక బయటపెట్టింది. భారత ప్రభుత్వం గతంలో పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతమైనట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనల్లో వాస్తవమెంత అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.

భారత్ తన అణు సామర్థ్యాన్ని పటిష్టపరుచుకునేందుకు మరిన్ని అణు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సంతానం పేర్కొన్నారు. సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ)పై సంతకం చేసే ముందు భారత్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉందని, దీని కోసం మరిన్ని పరీక్షలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.

1998లో భారత్ పోఖ్రాన్- 2 అణు పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆనాటి పరీక్షా ప్రదేశంలో సన్నాహకాలకు సంతానం డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ పరీక్షలో వచ్చిన ఫలితాలు అంచనాలకు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని సంతానం తాజాగా వెల్లడించారు. భారత్‌లో 1998లో థర్మోన్యూక్లియర్ పరీక్ష లేదా హైడ్రోజన్ బాంబు పరీక్ష నిర్వహించింది.

దీనిపై అనంతరం చేసిన ప్రకటనలు వాస్తవాలకు భిన్నమేనని, ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని సంతానం అన్నారు. అణు పరిభాషలో ఆనాటి పరీక్షను "ఫిజిల్‌" (తుస్సుమనే అర్థం)గానే భావించాలి. ప్రయోగం విజయవంతమైతే దానిని బిగ్‌బ్యాంగ్‌గా వ్యవహరిస్తారు. పోఖ్రాన్- 2 అనంతరం చేసిన ప్రకటనలు, వచ్చిన ఫలితాలకు భిన్నంగా ఉన్న కారణంగా సీటీబీటీపై సంతకం చేసేందుకు తొందరపడరాదని సంతానం సూచించారు.

ఈ దేశాని అ దేవుడే కాపాడాలి...

Friday, August 7, 2009

చిరు --చిరు గాలేనా?


హైదరాబాద్: ‘మన పార్టీ పరిస్థితి బాగోలేదు. మనం ఏ పాత్ర పోషిస్తు న్నామో, మన పాలసీలు ఏమిటో మనకే తెలియ డం లేదు. ఎవరికీ విశ్వాసం కల్పించకపోవడంతో నాయకులంతా వెళ్లిపోతున్నారు. నేను రాజకీ యాల నుంచి వచ్చినవాడిని. నన్ను నమ్ముకున్న వారంతా పార్టీ మనుగడపై ఆందోళనతో ఉన్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ పద్ధతిని ఇకనయినా మార్చుకోవా’లని పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవికి ఆ పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ స్పష్టం చేశారు. చిరు నివాసానికి వెళ్లిన దేవేందర్‌ గౌడ్‌ వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చిం చారు.తాను టిడిపిలో చేరుతున్నానన్న సంకేతాలు పంపారు. అయితే.. పార్టీ వీడవద్దని, అంతా కలసి బలోపేతం చేద్దామని చిరంజీవి బ్రతిమిలాడారు. ఆ తర్వాత ఆయన తన రాజీనామా పత్రాన్ని చిరం జీవికి ఇచ్చారు.
మనం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లో బాగా వెళుతున్నాయని, అసెంబ్లీలో కూడా మనం ఏమీ మాట్లాడ కపోవడం వల్ల ప్రతిపక్షంగా గుర్తించే పరిస్థితి లేకుండా పోతోందన్నారు. నన్ను నమ్ముకుని వచ్చిన వారికి సర్దిచెప్పలేకపోతున్నానని, పార్టీలో మార్పు వస్తుం దని ఆశించినప్పటికీ అది వచ్చేలా కనిపించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలసి పోటీ చేయాలని సూచించారు. మీరు నాకు తగినంత గౌరవం ఇచ్చినప్పటికీ, నేను వచ్చిన రాజకీయ నేపథ్యం కారణంగా ఇమడలేకపోతున్నానన్నారు. పార్టీ పెట్టి ఇంతకాలమయినా ఇంకా రాజకీయ పార్టీగా రూపుదాల్చకపోతే కష్టమన్నారు. తామంతామిమ్మల్నే నమ్ముకున్నామని, మీరు ఇకపై ఏది చెబితే అది చేస్తామని హామీ ఇచ్చారు. తాను ప్రజల్లో తిరుగుతానన్నారు. అం దుకు స్పందించిన గౌడ్‌ ‘నేను మీతో వారం రోజులు ఒక అంశంపై చర్చించి దానిని మీడియా కు చెబితే, మీరు మరుసటిరోజునే దానిని ఖండిస్తారు. ఇక నాకేం విలువ ఉంటుంద’ని తానుపార్టీలో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు.
వెళ్లితే..వెళ్లనివ్వండి !
దేవేందర్‌గౌడ్‌ వెళ్లిపోతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆపార్టీ నాయకులు అధ్యక్షుడు చిరంజీవితో భేటీ అయ్యారు. అల్లు అరవింద్‌ ఈ విషయంపై దేవేందర్‌గౌడ్‌తో సమావేశమై నచ్చ చెప్పినా ఫలితం లేకపోవడంతో వారు చిరంజీవితో చర్చించినట్లు తెలిసింది. అల్లుఅరవింద్‌తోపాటు కొత్తపల్లి సుబ్బరాయుడు, ఉపేంద్రలు చిరంజీవితో కలిసినట్లు సమాచారం. సమావేశంలో చిరంజీవి ‘ వెళితే వెళ్లనివ్వండి..ఆయన మానసికంగా సిద్ధమ య్యారు..చాలా మంది వెళ్లిపోయారు..అయినా ఎలాంటి నష్టం లేదు..పార్టీని కిందిస్థాయి నుంచి పునర్నిర్మించుకుందాం..’ అన్నట్లు తెలిసింది.

సిగ్గు లేని జేన్న్మలు

భేతాళ కథలు


డౌన్లోడ్ చేయండి: