Tuesday, December 29, 2009

చిత్ర లోకం @ తెలంగాణ

మీకో దండం. ఇక తమరు పెద్దాపురం కానీ,చిలకలూరిపేట కానీ వెల్లండి.

ఆంధ్రా ,తెలంగాణా కాకులు.


జోడు గుర్రాలపై స్వారీ...!


నా సీటుకే ఎసరు పెడదామనుకున్తున్నావా ...!


వందా... నా బొందా...!

ముఖ్యమంత్రి రోశయ్య గారు అనేక సమస్యలను ఎదుర్కుంటూ ఈ మద్యనే వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు.


ముక్కలు చెక్కలు

రాష్ట్రాన్ని చేస్తే అయిదు ముక్కలు చేయండి లేదంటే ఒక్కటిగా ఉంచండి అంటూ సీమ,ఆంద్ర MLAలు రాజీనామాలు చేయడం మొదలెట్టారు. కొంత మంది నాయకులు ప్రత్యెక తెలంగాణ కావాలంటే మిలిగిన వాళ్లు నెల్లూరు ,ప్రకాశం జిల్లాలతో కలిపి గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలంటున్నారు. కొంతమంది హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని, మరికొంతమంది విశాక రాజదానిగా కళింగ ఆంద్ర కావాలని అడుగుతున్నారు. పాపం గుంటూరు,కృష్ణా,ఉభయ గోదావరి జిల్లాలు ఎవరికీ వద్దంట. ఈ జిల్లాలను కలిపి ఐదో రాష్ట్రం చేస్తే సరిపోతుంది.
ఈ MLAల రాజీనామాల తో రాష్ట్రంలోని అన్ని పార్టీలలో సంక్షోభం వచ్చి పడింది.ప్రభుత్వం వుంటుందో ఊడుతుందో అర్ధం కాని పరిస్థితిలో ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు.రోజు బంద్ లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ బంద్ ల వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా. ఈ బంద్ ల వల్ల ఆర్టీసీ ,విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.ఎన్నాళ్ళు బంద్ లు కొనసాగిస్తారు.మరోవైపు మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయి రాజీనామాలు చేస్తామంటున్నారు. సోనియా పరిస్థితి చూస్తే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుంది. హైకోర్టు లో న్యాయవాదులు వాదులాడుకోవడం మానేసి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆమరణ నిరాహారదీక్ష పెద్ద ప్యాషన్ ఐపోయింది. ప్రతివాడు దీక్షలు చేసేవాడే.
మన లగడపాటి గారి వాదన ఏమిటంటే సమైక్యంగా ఉంటే ఎక్కువ మంది లను పార్లమెంటు కు పంపితే ఎక్కువ నిధులు తెచ్చుకోవచ్చని.మరి ఇప్పుడు ముప్పయికి పైగా ఎం.పి. లు ఉంది ఎన్ని నిధులు తెచ్చారో.ఈయన గారు మనకు రైల్వే బడ్జెట్ లో అన్యాయం జరిగినప్పుడు,వరదసాయం లో అన్యాయం జరిగినప్పుడు ఏమిచేస్తున్నారు.ఇలాంటి ఎం.పి. లు ముగ్గురు ఉన్నా మూడు వందలమంది ఉన్నా ఒరిగేది ఏమిలేదు. అందరు అన్ని పంచుకోగా మిగిలిన ఏదో ఒక పనికిమాలిన మంత్రి పదవి పడేస్తే అదే మహాభాగ్యమని మన కాంగ్రెస్ ఎం.పి. లు సంబరపడిపోతారు. వీళ్ళు మనకి నిధులు తీసుకువస్తారా.
ఇదంతా సోనియా ఆడిస్తున్న డ్రామా. రాష్ట్రం లో జగన్ వర్గానికి చెక్ పెట్టడానికి,అందరిని తన కంట్రోల్ లో పెట్టుకోవడానికి ఇలా ప్రాంతీయ విబేదాలు సృష్టిస్తున్నారు. పనిలో పనిగా ఇప్పుడిప్పుడే బలపడుతున్న తే.దే.పా. ను చీల్చడానికి పన్నిన ప్లాను ఇది. దీనివల్ల పాపం ప్రజలలో ప్రాంతీయ విబేదాలు సృష్టిస్తున్నారు.జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ సొంత పార్టీ లో MLAలు ఎంత గోల చేసినా అందరిని అణచివేసిన సోనియా కే.సి.యార్. కు లొంగుతుందా. అయితే ఎత్తు కు చంద్రబాబు షాక్ తిన్నాడు.పార్టీ వాళ్లు రెండుగా విడిపోతున్నారు.తెలంగాణ పై వెనక్కు తగ్గితే మేము కూడా రాజీనామాలు చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో ఆలస్యంగానైనా తేరుకున్న బాబు కోస్తా,సీమ ఎం.ఎల్.. లను రాజీనామాలు ఆమోదించాలంటూ స్పీకరుని డిమాండ్ చేయిస్తున్నాడు, తెలంగాణా ఏం.ఎల్.ఎ లను కూడా ఉద్యమాలు చేయాలని చెప్తున్నాడు. విదంగా ముందుకు పోవడం వల్ల కాంగ్రెస్ ఎం.ఎల్. లను డిఫెన్స్ లో పదేయ్యోచ్చునని బాబు గారి ఆలోచన కాబోలు. ఏది ఏమైనా ఏది ఒక సస్పెన్స్ సినిమా క్లైమాక్సు చూస్తున్నట్టుగా ఉంది. మరి ముగిపు ఎలా,ఎప్పుడు ఉండబోతుందో నాకు అర్ధం కావడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.

No comments:

Post a Comment